Tuesday, April 23, 2024

ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆంక్ష‌ల‌పై హైకోర్టులో జోగి లంచ్ మోష‌న్ పిటిష‌న్..

అమరావతి: ఏపీ హైకోర్టులో పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ లంచ్‌మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఎదురుగా ఎవరు పోటీకి దిగినా.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని రమేష్ హెచ్చరించారు. పెడనలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీడియో ఆధారాలు ఉండడంతో ఎస్ఈసీ ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని జోగి రమేష్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement