Tuesday, May 14, 2024

న్యూఢిల్లీ : వరుసగా 11వ రోజూ పెరిగిన పెట్రో ధరలు – రాజస్థాన్ లో రూ.100 దాటిన పెట్రోల్ ధర

చమురు సంస్థలు వరుసగా  11వ రోజూ పెట్రో ధరలను పెంచాయి. శుక్రవారం నాడు పట్రోల్ ధర లీటర్ కు రూ.31లు, డీజిల్ లీటర్ కు రూ.0.33 లు పెరిగింది.  దీంతో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోరికార్డు స్థాయిలో  పెట్రో ధరలు మండిపోతున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు 90.19 కు చేరుకుంది. డీజిల్ రేటు లీటరుకు. 80.60 పలుకుతోంది. ఇలా ఉండగా   రాజస్థాన్‌లో పెట్రోల్‌కు లీటరుకు రూ.100 స్థాయిని దాటేసింది. కాగా గురువారం మధ్యప్రదేశ్‌లో కూడా పెట్రోల్ ధర లీటరుకు సెంచరీ మార్క్‌ను అధిగమించింది. మధ్య ప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.100.25 దాటి పరుగులు తీయడం గమనార్హం. నేడు (శుక్రవారం) ఇక్కడ పెట్రోలు ధర రూ.100.57 వద్ద, డీజిల్‌ 91.04 వద్ద కొనసాగుతున్నాయి.

పలు నగరాల్లో పెట్రోల్,డీజిల్‌ ధరలు లీటరుకు

ముంబైలో పెట్రోల్ రూ. 96.32 కు, డీజిల్ రూ. 87.32

చెన్నై పెట్రోల్ రూ. 92.25, డీజిల్ రూ. 85.63

బెంగళూరు పెట్రోల్ రూ. 93.21, డీజిల్ రూ. 85.44

- Advertisement -

హైదరాబాద్‌ పెట్రోల్ రూ. 93.78, డీజిల్ రూ. 87.91

అమరావతి పెట్రోల్ రూ. 96.34, డీజిల్ రూ. 89.94

Advertisement

తాజా వార్తలు

Advertisement