Sunday, May 5, 2024

న్యూఢిల్లీ : అగ్రరాజ్యాధినేత బైడెన్ తో మోడీ మాటా మంతి

అగ్రరాజ్యాధినేత బైడన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.  అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ లో శాంతి,  ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇరువురమూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మోడీ ఆట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement