Sunday, April 28, 2024

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏమీ లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీనాయకులు తనకు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement