Sunday, May 5, 2024

చెలరేగిన స్మృతి మందన.. సిరీస్ సమం

సొంతగడ్డపై ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత అమ్మాయిలు రెచ్చిపోయారు. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అమ్మాయిలపై భారత అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. జూలన్ గోస్వామి 4 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు, మానసి జోషి రెండు వికెట్లు సాధించారు.

అనంతరం భారత్ స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగగా.. స్మృతి మందన (64 బంతుల్లో 80 నాటౌట్) విజృంభించింది. అటు పూనమ్ రౌత్ (62 నాటౌట్) కూడా అదరగొట్టడంతో 28.4 ఓవర్లలోనే భారత్ టార్గెట్‌నే ఛేదించింది. కాగా తొలి వన్డేలో భారత్ పరాజయం పాలుకాగా తాజా గెలుపుతో 5 వన్డేల సిరీస్ సమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement