Friday, May 3, 2024

కుక్కలతో జల్లికట్టు పోటీలు

కుక్కలతో జల్లికట్టు నిర్వహించిన ఘటన తమిళనాడులోని తిరుమణ్ణాములై జిల్లా కాటుక్కనల్లూర్‌ కాలనీలో చోటుచేసుకుంది. పోటీలు నిర్వహించిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోటీలో పాల్గొనేందుకు పలు జిల్లాలకు చెందిన యజమానులు తమ కుక్కలను తీసుకొచ్చారు. వెంటనే సమాచారం అందుకున్న కన్నమంగళం పోలీసులు అక్కడి చేరుకుని ఇలాంటి పోటీలు నిర్వహించరాదని హెచ్చరించారు. అయిన పట్టించుకోకుండా ప్రారంభించారు. దీంతో 8 మంది నిర్వాహకులపై పోలీసులు కేసులు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement