Wednesday, May 8, 2024

ఒలింపిక్స్‌లో తెలుగు కుర్రాడికి బెర్త్ ఖాయం

విజయవాడ: త్వరలో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. పుణెలో నిర్వహించిన ఫైనల్ ట్రైల్స్ 70 మీ. ర్యాంకింగ్‌లో 2880 పాయింట్లకు 2677 పాయింట్లు సాధించి 2వ ర్యాంకర్‌గా నిలిచాడు. అయితే మరో ఆర్చర్ జయంత్‌తో ధీరజ్ స్కోరు టై అయింది. వీరిద్దరికి నిర్వహించిన పోటీలో ధీరజ్ 3-1 తేడాతో విజయం సాధించాడు. దీంతో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ధీరజ్ అర్హత సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement