Monday, April 29, 2024

ఏపీలో కొత్తగా 120 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 48,973 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 120 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 25, విశాఖ జిల్లాలో 17, కడప జిల్లాలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప.గో. జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,91,004కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,064 ఉండగా, ఇప్పటివరకు 8,82,763 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఒకరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7,177కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement