Sunday, May 5, 2024

అలా అయితే మా పార్టీని మేమే మూసేస్తాం: బుద్ధా వెంకన్న

రేణిగుంట విమానాశ్రయంలో తమ పార్టీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నెలల పాలనలో వైసీపీపై ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వచ్చిందని, దీంతో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారనే భయం జగన్‌లో మొదలైందని బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రజలు వైసీపీ వెనుక ఉన్నారని వైసీపీ నేతలు అతి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని, అలాంటప్పుడు అసెంబ్లీని రద్దు చేసి తక్షణం ఎన్నికలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిస్తే తమ పార్టీ టీడీపీని మూసేస్తామని.. ఒకవేళ టీడీపీ గెలిస్తే వైసీపీని మూసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వైసీపీ బెదిరింపులకు చంద్రబాబు భయపడరని, దుష్టశక్తులు లాంటి వైసీపీ నేతలపై పోరాడేందుకు ఆయన వెనకడుగు వేయరని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement