Sunday, May 5, 2024

యాదాద్రి హుండీ ఆదాయం రూ.1.89 కోట్లు

యాదగిరిగుట్ట : యాదాద్రి స్వయంభువు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో గల హుండీలలో భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను మంగళవారం లెక్కించారు. 28 రోజుల్లో భక్తుల నుంచి కోటీ 89 లక్షల 75 వేల 468 రూపాయల ఆదాయం హుండీ ద్వారా వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్‌.గీతారెడ్డి తెలిపారు. నగదుతో పాటు 321 గ్రాముల బంగారం, మూడు కీలోల 750 గ్రాముల వెండిని భక్తులు హుండీలో సమర్పించుకున్నారు. విదేశీ భ క్తుల నుంచి అమెరికా డాలర్లు – 120, కెనడా – 75 డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్లు – 50, న్యూజిలాండ్‌ డాలర్లు – 20 డాలర్లు, సింగపూర్‌ డాలర్లు – 4, కథర్‌ -1 రియల్స్‌, యూఏఈ-15 ధిరామ్స్‌, స్కాట్లాండ్‌-10 ఫౌండ్స్‌ హుండీ ద్వారా లభించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. లెక్కింపు పర్వం కొండ పైన గల హరిత హోటల్‌లో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement