Saturday, May 4, 2024

టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భేష్‌

తిరుమల, ప్రభన్యూస్‌ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా మహాద్వారం వద్దకు చేరుకు న్నారు. అక్కడ టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతం ఆలయంలోకి చేరుకున్న ఉప రాష్ట్ర పతి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకు ల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఛైర్మన్‌, ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, క్యాలెండర్‌, డైరీ, కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని అందచేశారు. ఇటీవల డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో తయారు చేసిన ల్యామినేటెడ్‌ ఫొటో, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, ఆరు షీట్ల క్యాలెండర్లను ఈవో అందచేస్తూ, వాటి ప్రాముఖ్యతను ఉప రాష్ట్రపతికి వివరించారు. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళికి శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. టీటీడీ అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సనాతన హింధూధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళుతున్నందుకు ఆయన ప్రశంసించారు. గురువారం వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న తన మనవరాలు సుష్మకు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని అనుగ్రహించాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు. చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, ఢిల్లిd స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటి ఈవో రమేష్‌బాబు, రిసెప్షన్‌ డిప్యూటి ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement