Tuesday, April 30, 2024

వీరభద్రుని సేవలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ

రాయచోటి, (కడప) ప్రభన్యూస్‌ : శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారిని తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరిని ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆహ్వానించి అర్చకులు ప్రత్యే క పూజలు చేయించారు. వీరు ఆలయాభివృద్ధిపై అర్చకులు, ఈవో, పాలకమండలి సభ్యులతో చర్చించి దేవస్థానం అభివృద్ధికి చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలను తెలుసుకుని వారిని అభినందించారు. అనంతరం పాలకమండలి సభ్యులు సురేష్‌కుమార్‌ సత్కరించారు వీరి వెంట అర్బన్‌ ఎస్‌ఐ నరసింహారెడ్డి, మునిసిపల్‌ ఆర్‌ఐ మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నట్లు ఆలయ ఈవో మంజుల, ఆలయ ఛైర్మన్‌ పోలంరెడ్డి విజయలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement