తిరుపతి రూరల్, ప్రభన్యూస్: శ్రీవారు, అమ్మవార్ల చిత్రాలకు 3డి ఎఫెక్ట్, సిల్వర్ కోటింగ్తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల క్యాలెండర్ను టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్మన్ మాట్లాడుతూ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు- చెప్పారు. ఒక్కో పేజీలో రెండు నెలలకు సంబంధించిన వివరాలు ఉండేలా రూపొందించామని తెలిపారు. 25 వేల కాపీలు ముద్రించామని, ఒక్కో క్యాలెండర్ ధర రూ.450 అని వెల్లడించారు. తిరుమల, తిరుపతితో పాటు- విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటు-లో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవోఏవీ.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏవో ఓ.బాలాజి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేషశైలేంద్ర, హెల్త్ అడ్వైజర్ డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ కార్పొరేషన్లో చేరిన ఉద్యోగుల గుర్తింపు కార్డులను కార్పొరేషన్ సీఈవో శేషశైలేంద్ర ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డికి చూపించారు. ఇటీ-వల వెయ్యి మందికిపైగా కార్పొరేషన్లో చేరారని, వీరికి కల్పించే సదుపాయాల గురించి వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement