Wednesday, May 1, 2024

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

సూత‌న సంవత్సరం సందర్భంగా ప్రయాణీకులకు ఆర్.టి.సీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మెస్ & మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ యంజీబీఎస్ విచ్చేసి కేక్ కట్ చేసి ప్రయాణికులకు, ఉద్యోగులందరికీ పేరుపేరున నూతన సంవత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వుండాలని, సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి పూర్వ వైభ‌వం తేవాల‌ని ప్ర‌తిజ్ఞ‌ చేయించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగుల ప్రయాణ సౌక‌ర్యార్థం యంజీబీఎస్ మెయిన్ గేట్ నుండి బస్టాండ్ లోనికి ఉచిత సర్వీసు వాహానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పి.వి.మునిశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ (హెచ్ అండ్ కే) జోన్స్, బి.వరప్రసాద్, రీజనల్ మేనేజర్ (రంగారెడ్డి), ఎం.రాంచంద్రారెడ్డి, డివిజనల్ మేనేజర్ (హైదరబాద్ రూరల్), సుచ‌రిత తో పాటుగా, డిపో మేనేజర్లు, వివిధ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement