Saturday, April 27, 2024

1న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల

ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 1న ప్రత్యేక టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు 600 టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజ‌నం, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నామని వివరించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. టిక్కెట్‌ ధర ఒక్కొక్కరికి రూ.2,500గా నిర్ణయించింది. మరింత సమాచారం కోసం www.tirumala.org, www.tirupatibalaji.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement