Monday, April 29, 2024

ప‌న్నీర్ సెల్వం పిటిష‌న్ ని కొట్టివేసిన సుప్రీంకోర్టు

ప‌న్నీర్ సెల్వం వేసిన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ శాసననభాపక్ష నేత పళనిస్వామి అధ్యక్షతన ఈ నెల 11న నిర్వహించిన సర్వసభ్యమండలి సమావేశం చెల్లదంటూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సమావేశం చెల్లుతుందంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. అన్నాడీఎంకే పార్టీ నియమనిబంధనలను పళనిస్వామి పూర్తిగా ఉల్లంఘించారని ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ… పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు మళ్లీ ఒకే వర్గంగా వ్యవహరించే అవకాశం ఉందా అని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కలిసే అవకాశం ఉందని ఒక వర్గం, ఏ మాత్రం అవకాశం లేదని మరో వర్గం న్యాయవాదులు తెలిప‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement