Wednesday, May 15, 2024

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొండంత.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 48 గంట‌ల స‌మ‌యం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దాదాపు అన్ని కంపార్ట్మెంట్ల‌లో భ‌క్తులు నిండిపోయారు. దీంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందుల‌కు క‌ల‌గ‌కుండా ఆల‌య అధికారులు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,007 మంది భక్తులు దర్శించుకోగా 42,866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.25 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement