Tuesday, April 30, 2024

జయ-విజయుల శాప కారణం

శ్రీమహావిష్ణువు భక్తులు జయుడు- విజయుడు. వీరిద్దరూ వైకుంఠంలో ఏడవ ద్వారానికి ద్వార పాలకులు. ఒకరోజు బ్రహ్మమానసపుత్రులు సనకసనందనాదులు విష్ణుమూర్తి సందర్శనానికి వైకుంఠానికి వచ్చారు. ఎవరూ అడ్డు పెట్టలేదు. ఆరు ద్వారాలు దాటి ఏడవ ద్వారం దగ్గ రకు వచ్చారు. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిల కేళీమందిరమే ఏడవ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయవిజయుల అనుమతికావాలి. సనకసనందులకు మాత్రం ఎవరి అనుమతితో పనిలేదు. వారు బ్రహ్మస్వరూపులు. వారు ద్వారం దాటబోతుండగా జయవిజయులు వారిని అడ్డగించడ మే కాక నిందావాక్యాలతో అవమానించారు. ఇది వైకుంఠం. ఏడవద్వారం. ఏకాంత మందిరం లోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి. వెనక్కి వెళ్ళిపోండి అన్నారు.
సనకసనందులు ఆగిపోయి జయవిజయుల్ని చూసి ఆగ్రహంతో“”జయవిజయులారా! మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారు? మేము సనకసనందనాదులం. విష్ణు భక్తులం. శ్రీహరిని సందర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరంలేదు. నిష్కాములమయిన మేము శ్రీహరిని సేవించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా? దురాత్ములు మీరు. ఈ పుణ్యలోకంలో ఉండడానికి అనర్హులు. మీ పాపానికి భూలోకమే సరైంది. వెళ్ళి భూలోకంలో పుట్టండి” అని శపించారు. ఆ శాపానికి జయవిజయులు భయకంపితులై మునుల కాళ్లమీద పడి కాపాడమని వేడుకున్నారు.
”మహా మునులారా మీపట్ల తప్పుగా ప్రవర్తించాం. మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కూడా జీవించలేము. కరుణించండి. మీ శాపానికి తిరుగులేదన్న సంగతి మాకు తెలుసు. అందుకనే మా కోరిక మన్నించి మేము ఏ జన్మ ఎత్తినా, ఎక్కడ ఉన్నా మా భగవద్భక్తి, భగవన్నామస్మరణా ఉండేలా అనుగ్రహించండి” అని వేడుకున్నారు. లోపల వున్న శ్రీమహావిష్ణువుకు ఇదంతా వేడుకగా అనిపించింది. నవ్వుకుని బయటకు వచ్చాడు.
శ్రీహరిని చూడగానే సనకసనందనాదులు నమస్కరించి అనేక వేదమంత్రాలతో స్తుతించా రు. శ్రీహరి సంతోషించి మునులను చూసి తరువాత జయవిజయులను చూసి అంతా గ్రహిం చా నని చూపులతోనే వారికి తెలియజేశాడు. మునులతో ఇలా అన్నాడు. ”మహా మునులారా! వీరు క్షమించరాని నేరమే చేశారు. శిక్షార్హులే. సేవకుల తప్పులన్నీ ప్రభువుకే చెందుతాయి. అందువల న నేనూ మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే. అందుకే క్షమించండి. మునులు దైవసమానులు. నా భక్తులు నాకంటే అధికులు. మీ మాటలు పొల్లుపోవు. మీ శాపం ఫలించి తీరుతుంది.” అన్నాడు.
”అంతా నీ లీల” అని మునీశ్వరులు శ్రీహరికి మరొక్కసారి మనసారా చూసుకుని నమస్క రించి నిష్క్రమించారు. జయవిజయులు శ్రీహరి కాళ్ళపై పడి ”అజ్ఞానంతో మునులను అవమా నించాం. నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం. తప్పే అని ఒప్పుకుంటున్నాం. కాని వారి శాపాన్ని మేము భరించలేము. నీకు దూరంగా జీవించలేము. కరుణించు మహాదేవా” అని వేడు కున్నారు. ”మునుల శాపం తిరుగులేనిది అనుభవించి తీరాల్సిందే. మీకు లక్ష్మీదేవి శాపం కూడా వుంది కదా. ఒకరోజు నేను ఏకాంతమందిరంలో ఉండగా లక్ష్మీదేవి లోపలికి వస్తుండగా మీరు ఆమెను అడ్డుకుని ఆమె శాపానికి గురయ్యారు. మునుల శాపం, లక్ష్మీ దేవి శాపం ఫలించి తీరా ల్సిందే. తప్పుడు” అన్నాడు. జయవిజయులు కలతచెంది శ్రీహరిని వేడుకున్నారు. వారిపట్ల జాలి కలిగి శ్రీహరి ”దిగులు పడకండి. భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి, నాకు బద్ధశత్రు వులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు. ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తా రు. మూడు జన్మల అనంతరం మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది. స్నేహంతోకానీ, శతృత్వం తోకానీ నిరంతరం నన్నే స్మరించేవారికి నా సాయుజ్యం లభించకుండా ఉండదు. విరోధం కార ణంగా మీరు ఎల్లప్పుడూ నన్ను ద్వేహిస్తూ, స్మరిస్తూ ఉంటారు.” అంటూఓదార్చాడు. అలా జయవిజయులు సనకసనందాదులు, లక్ష్మీదేవిల శాపానికి గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement