Tuesday, May 7, 2024

విశాఖ శారదాపీఠంలో సుబ్రమణ్య షష్టి వేడుకలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామిని ఆరాధిస్తూ పీఠం ప్రాంగణంలో పాలకావిడిని ఊరేగించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అలాగే వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పీఠం ప్రాంగణంలో కళ్యాణం నిర్వహించారు. వేడుకగా సాగిన ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుష్టాన దైవం సుబ్రమణ్యేశ్వర స్వామిని, పీఠం ప్రాంగణంలోని షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయంలో నిత్యం కొలుస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement