Saturday, May 4, 2024

యోగానంద నృసింహమూర్తిగా సింహాద్రినాథుడు

వైభవంగా మాడవీధుల్లో తిరువీధి
విశాఖపట్నం, ప్రభ న్యూస్‌ బ్యూరో : సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో రాపత్‌ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు సింహాద్రినాథుడిని ప్రత్యేకంగా అలంకరిసు ్తన్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం యోగానంద నృసింహ అవతారమూర్తిగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఉభయ దేవేరులతో కూడిన స్వామిని ఆస్థాన మండపంలో ఆశీనుల్ని చేసి వేద మంత్రోచ్చరణలు మృధుమధుర మంగళవాయిద్యాల నడుమ వేద, ఇతిహాస, పురాణ దివ్య ప్రబంధ పారాయణలు విన్నవించారు. అనంతరం స్వామి అమ్మవార్లను అందం గా అలంకరించిన పల్లకీలో ఆశీనుల్ని చేసి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామిని దర్శించి సేవించి తరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement