Thursday, May 23, 2024

శ్లోక సౌందర్యం!

మన ప్రాచీన కవులు ఎంతో సుందరమైన సాహిత్యంతో ఇతిహాసాలను మనకు అందిం చారు. 14వ శతాబ్దానికి చెందిన సూర్యసూరి అనే కవి ఎంతో అద్భుతమైన కావ్యా న్ని అందించారు. ఆ కావ్యంలోని ఈ శ్లోక సౌందర్యాన్ని ఆస్వాదిద్దాము.

శ్లో|| తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం

ఈ శ్లోకం శ్రీరామకృష్ణ విలోమ కావ్యం లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు దివిసీమ తాలూకా కవి. ఈ శ్లోక విశేషమేమంటే మొదటి నుండి చివర వర కు చదివినా, చివరి నుండీ వెనుకకు చదివినా ఒకేలాగా ఉంటుంది. అంటే వికటకవిలాగా అన్నమాట. ఇంగ్లీషులో దీనిని ప్యాలిన్డ్రోమ్‌ అంటారు. అర్థబేధం మాత్రం ఉంటుంది. ఎడ మ నుండీ కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగాను, కుడి నుండి ఎడమకు చదివినపుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది. చూడండి. ఎడమ నుండి చదివినప్పుడు ఎవరైతే సీతను రక్షించారో, ఎవరికి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పర మ అద్భుతమో, ఎవరి నుండైతే దయ, అద్భుతమూ అన్నిచోట్లా వర్షిస్తుందో అట్టి శ్రీరాము నికి నమస్కరిస్తున్నాను. అనే అర్థం వస్తుంది. అదే కుడినుంచి చదివినప్పుడు యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైనట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను అని అర్థం వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement