Thursday, May 2, 2024

సర్ప పూజకు ఉద్దిష్టము నాగుల చవితి

ప్రకృతిని, అందులోని జంతువులను పూజించడం భా రతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం. సమస్త జీవకోటిలో ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. ఇం దులో భాగంగానే పాములను పూజిస్తారు. ముఖ్యంగా దీపా వళి అమావాస్య తర్వాత వచ్చే కార్తిక శుక్ల పక్ష చవితిని ‘నాగు ల చవితి’ అని పిలుస్తారు. ఆ రోజు నాగుపాములను కొలుస్తారు. ఈరోజు సర్పపూజకు ఉద్దిష్టమైన దినం. కార్తీక శుద్ధ చవితి నాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెపుతున్న ది. శ్రీనాధుని శివరాత్రి మహాత్మ్యంలో ఇలా వర్ణింపబడినది.
”చలి ప్రవేశించు నాగుల చవితి నాడు
మెరయు వేసవి రథసప్తమీ దివసమున
అచ్చ సీతు ప్రవేశించి బెచ్చు పెరిగి
మార్గశిర పౌష మాసాల మధ్యవేళ”

పై గీతాన్ని బట్టి నాగుల చవితి కార్తిక మాసంలో వస్తుం దని అర్ధమవుతున్నది. ఈ నాగుల చవితినాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోతాయని, రాహు కుజ దోషాలు తొలగిపోతాయని, పెండ్లి కావాల్సిన యువతులు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే త్వరగా పెళ్లి అవు తుందని నమ్మకం. సంతానం లేనివారికి సంతానం కలుగు తుందని, గర్భ దోషాలు పోతాయని, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయని, చెవి, చర్మవ్యాధులు తొలగి పరి పూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం.
నాగులు, గరుడులు, వానరులు, రాక్షసులు, అసురులు వీరంతా వేరువేరు జాతుల వారంటారు మానవ శాస్త్రజ్ఞులు. అస్సాం దక్షిణ భాగంలో ఉన్న నాగాయ్‌ కొండలలో ఇప్పటికీ నాగజాతి వారున్నారు. నాగులకు, ఆంధ్రులకు ప్రాచీన కాల ము నుండి విశేష సంబంధముంది. భారతావనిలో అనేక ప్రదే శాలలో నాగజాతి వారున్నట్లు చరిత్ర చెపుతున్నది. కాశ్మీర రాజులు తాము కర్కోటక నాగరాజు సంతతి వారమని చెప్పు కునే వారు. నాగపూరు రాజన్యులు తాము పుండరీక నాగ రాజు సంతతికి చెందిన వారమని ప్రకటించుకునే వారు. ఆం ధ్రులూ నాగజాతి వారనే వాదన కూడా లేకపోలేదు. బౌద్ధ ధర్మమంటే నాగులకు ఆనురక్తి ఉన్నట్లు, బుద్ధునికి పరమ భక్తులై నాగులు బౌద్ధాన్ని ఆదరించి, అవలంబించారని బౌద్ధ వాఙ్మయంలో అనేక గాథలు తెలుపుతున్నాయి.
ఏలాపత్ర నాగుడు, ముచిలింద నాగుడు మొదలైనవారు బౌద్ధ గాథలలో ప్రసిద్ధులు. దిక్కులను పాలించే లోకపాలకుల కు, నాగులకు సంబంధమున్నట్లు బౌద్ధుల విశ్వాసం. అమరా వతి, నాగార్జునకొండతో పాటు అవిభక్త కరీంనగర్‌ జిల్లాలోని ప్రాచీనమైన ధూళికట్ట తదితర ప్రాంతాలలో బౌ ద్ధ శిల్పాలలో నాగరాజుల, నాగిమల చిత్రాలున్నాయి. ప్రాచీనాంధ్రులు నాగులను కటి ప్రదేశం నుండి పైభాగమంతా మనిషి రూ పంలో, క్రింది భాగమంతా సర్ప రూపాలలో చెక్కారు. నాగ రాజు చిత్రాలకు తలపైన ఐదు పడగలుంటాయి. నాగినికి ఒక్క టే పడగ. భారతావనిలో నాగపూజ ఆది నుండీ ఆచరణలో ఉంది. గౌతముడు తన గృ#హ్య సూత్రాలలో పేర్కొనగా యజ్ఞ మంత్రాలలో నాగుల స్తుతి పేర్కొనబడింది. నాగశిలలు, నాగ కల్లులూ, ప్రతిమలు ప్రతి చోట దర్శ నమిస్తాయి. పుట్టిన బిడ్డలు చనిపోతుంటే సంతానం నిలవ డానికి నాగ ప్రతిష్ఠలు చేయ డం, ఆరాధించడం ఆచారంగా ఉంది. పాములు భూమి అంత ర్భాగమందు నివసిస్తూ భూ సారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి ‘నీటిని’ ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశ నంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరో క్షంగా ‘రైతు’కు పంటనష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృ తిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ఆదినుండీ ఆంధ్రులు, నాగారాధకులుగా ఉన్నారు.
”నన్నేలు నాగన్న నాకులమునేలు, నాకన్న వారల, నా యిం టి వారల, అప్తుల మితృలనందరను నేలు, పడగ దొక్కి న, పగ వాడనుకోకూ, నడుము దొక్కిన నావాడను కొనుమూ తోక తొక్కిన తొలగుచు పొమ్ము, ఇదిగో! నూక నిచ్చెదను పిల్లల మూకను నా కిమ్ము” అని నాగే శ్వరుని ప్రార్థించడం అనవాయితీగా ఉంది. ఐదు తలల పాములను వెండితో గాని, మట్టితోనైనా చేసి పూజించడం ఆచారం. చెవిలో చీము పట్టినా, వినపడక పోయి నా, చెవులను బంగారు, వెండితో చేయించి శివాలయాలకు సమర్పించడం పరిపాటిగా ఉంది. అనంత, వాసుకి, శేష, పద్మ నాభ కంబల, కర్కోటక, అశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీ య, తక్షక, పింగళి అని 12 రకాల సర్పాలను ఒక్కొక్క నెల లో పూజించడం ప్రాచీన సాంప్రదాయంగా ఉండేది. ప్రపంచం లో శాస్త్రవేత్తలకు తెలిసిన దాదాపు అన్ని రకాల పాములున్న దేశం భారతదేశమే. మానవుని మానసిక శక్తికి #హందూ దేశం లో పాము చి#హ్నంగా ఉంది. మానసిక శక్తికి వేదాంత పరిభాష లో కుండలినీ శక్తి అని పేరు. నిస్సంగుల తపస్సు అంతా ఈ కుండలినీ శక్తిని లేపుటకే. కుండలినీ శక్తిని గ్రీకు భాషలో ”స్పీరిమా” అంటారు. స్పీరిమా అంటే సర్ప వలయం. కుండ లినిని సర్పంటైన్‌గా పిలుస్తారు.
శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటి నే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. మూలా ధారం నుండి సహస్రారము వరకు వెన్నెముక మధ్యనుండి సర్పాకారముగ కుండలినీ శక్తి అనబడు సుషు మ్నా నాడిని లేవ జూపడమే నాగపూజ ప్రధాన ఉద్దేశమని విజ్ఞుల భావన. కుండలినీ శక్తి మూలాధార చక్రంలో ‘పాము’ ఆకారమువలెనే వుంటుందని ‘యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరం లో నిదురిస్తున్నట్లు నటిస్తూ… కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కు తూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని #హరించి వేస్తూ ఉం టుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విష సర్ప పుట్టలను ఆరా ధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూ డా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ‘శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసే సత్కర్మనే నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల ఆంతర్యమని భావన.

Advertisement

తాజా వార్తలు

Advertisement