Wednesday, May 15, 2024

శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి

కర్నూలు, ప్రభ న్యూస్‌ బ్యూరో: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరి ంచుకొని శ్రీశైలంలో పదవరోజైన స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి యాగశాలలో స్వామికి చండీశ్వర పూజతో పాటు- రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. అనంతరం యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, త్రిశూల స్నానం చేయడం విశేషం. పూర్ణాహుతి కార్య క్రమంలో భాగంగా నారికేళాలు , పలు సుగంధ ద్రవ్యాలు , ముత్యం , పగడం , నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది . అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు , వేదపండితులు వసంతాన్ని ( పసుపు , సున్నం కలిపిన మం త్ర పూరిత జలం ) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు . తరువాత జరిగిన అవబృ థస్నానంలో చండీశ్వరస్వామికి పుష్కరిణీ వద్ద ఆగమశాస్త్ర పద్ధతిలో స్నానాదిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి . చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహిం చారు. ధ్వజారోహ ఇక సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం జరిపించారు. ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవ రోహణ చేయబడుతుంది. సదస్యం- నాగవల్లి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగాన నిత్య కల్యాణమండపంలో సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు నిర్వ హించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించడం గమనార్హం. వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతించారు. నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించబడిన శ్రీ భ్రమరాంబాదేవి వారికి సంప్రదాయం మేరకు మె-్టట-లు , నల్లపూసలు సమర్పించడం విశేషం. మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలు శుక్రవారంతో ముగియనున్నాయి . ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా నేటి ఉదయం శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిపిస్తారు. సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది . ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం , శయనోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement