Monday, April 29, 2024

‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఎలా ఉందంటే

ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కింది ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రం. ఈ మూవీలో హీరో శ‌ర్వానంద్, హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించారు. నేడు ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ – చిరు (శర్వానంద్‌)కు వయస్సు మీద పడుతుంటుంది. కానీ పెళ్లి కాదు. తన కుటుంబ సభ్యులు ఏ సంబంధం తెచ్చినా అతను రిజెక్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆద్య (రష్మిక మందన్న)తో అతనికి పరిచయం అవుతుంది. అయితే అప్పటి వరకు పెళ్లి అంటే రిజెక్ట్ చేసిన చిరు.. రష్మిక మందన్నను చూడగానే ప్రేమలో పడిపోతాడు. మరి చివరకు అతని ప్రేమ ఫలించిందా .. పెళ్లి చేసుకున్నాడా .. అందుకు అతను ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే…ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వారందరూ తమ పాత్రల్లో బాగానే నటించారు. అనేక చోట్ల కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్య కోసం చిరు పడే కష్టాలు నవ్వు తెప్పిస్తాయి. ఈ మూవీని పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో తెరకెక్కించారు. కనుక ఫ్యామిలీ అందరూ కలసి ఈ సినిమా చూడవచ్చు. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది. ఈ సినిమాతో శర్వానంద్‌కు రిలీఫ్ వచ్చినట్లే అనిపిస్తోంది.

డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సినిమాలోని పాటలు, టీజర్‌లు ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి వంటి సీనియర్‌ హీరోయిన్‌లు న‌టించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో లెవల్ దాటించిందని అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క పాత్రను ఆడియన్స్ ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని.. స్క్రీన్ ప్లే, రచన బాగుందని టాక్. స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ తిరుమల కిషోర్ అద్భుతంగా తీర్చిదిద్దారని టాక్ వినిపిస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి. శర్వానంద్ కూడా అలాంటి చిత్రాల్లో నటించాడు. అవి హిట్ అయ్యాయి. అందుకనే అతను మళ్లీ అదే జోనర్‌ను నమ్ముకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో బలమైన కథ ఉంటే పక్కా హిట్ గ్యారెంటీ. దీంతోపాటు కావాల్సినంత‌ కామెడీ ఉండాలి. అవి రెండూ ఈ సినిమాలో దండిగా ఉన్నట్లు సినిమా ట్రైలర్‌ను చూస్తేనే అర్థమైంది. కనుక శర్వానంద్ చాలా రోజుల తరువాత మళ్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లో పడిన‌ట్టే. ఇక మొత్తంగా చెప్పాలంటే.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా.. ఫ్యామిలీ అందరూ కలసి చూడాల్సిన మూవీ. ప్రేక్ష‌కుల అభిరుచిపై ఈచిత్రం విజ‌యం ఆధార‌ప‌డి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement