Wednesday, May 8, 2024

అమ్మ ఉన్న ఇల్లే సంపద, సౌఖ్యము!

దేవతలకు దానవులకు మధ్యపరిపాటిగా జరుగుతూండిన యుద్ధాలలో ఒకసారి గెలుపు దానవుల రాజైన బలిచక్రవర్తిది అవుతుంది. ఇంద్రుడిని త్రైలోక్యాధిపత్యపు సింహాసనం మీదనుంచి పారద్రోలి తాను ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు బలిచక్రవర్తి.
శా|| ఈలాగింద్రునిఁ బాఱఁద్రోలి బలితానేకాతపత్రంబుఁగాఁ
ద్రైలోక్యంబటులేలుచుంగ తమర్త్తప పతాపంబుతో
బూలోకాధ్వర భాగముల్గొనుచునంభోజాక్షసంప్రీతిగాఁ
జాలాజన్నములాచరించె గుణియై శాస్త్రోక్తమారంగుబ్నన్‌.
(ధరణిదేవుల రామయమంత్రి, దశావతార చరిత్రము)
ముల్లోకాలనూ ఏకచత్రాధిపత్యంగా ఏలుతూ, భులోకంలో నిర్వ#హంపబడే అన్ని యజ్ఞయాగాలలో దేవతలకోసం సమర్పించబడే #హవిర్భాగాన్ని దేవతలకు బదులుగా తాను స్వీకరిస్తూ, పర్మాత్ముడైన శ్రీమహావిష్ణువుకు ప్రీతి కలిగే విధంగా శాస్త్రోక్త పద్ధతిలో ఎన్నెన్నో యాగాలను నిర్వహస్తూ బలి చక్రవర్తి పాలించసాగాడు అని పై పద్యం భావం.
దేవతల ఈ దైన్యస్థితి వారి తల్లియైన అదితిని ఎంతగానో కలతకు గురిచేసింది. అసురుల బారి నుండి తన సంతానాన్ని ఎలాగైనా రక్షించుకోవాలనే తలపు ఆమెకు కలిగింది. వెంటనే తపస్సుకు పూనుకుంది. సంగతి తెలుసుకున్న బలిచక్రవర్తి కంగా రుపడి, ఏమి జరుగుతున్నదో తెలుసుకుని రమ్మని తన మనుషులను పంపిస్తాడు. వెళ్ళినవారు తపస్సులో నిమగ్నమై వున్న అదితిని చూడగా, ఆమె ఇలా కనబడింది వాళ్ళకు.
మ|| చరణాంగుష్ఠమునేలనూఁది భుజము ల్సారించిభూరేణుధూ
సరితానీలజటాభరంబుగుదుల్సంధించిమోమెత్తి యం
బరమున్సూచుచుశ్వాసవాయువుల నిర్బంధించి యత్యంత దు
స్తరమైనట్టి తపంబుసేయునదితిం దర్శించి వేమ్రొక్కుచున్‌.
(దశావతాచరిత్రము)
కాలి బొటనవేలును బలంగా ఆపు చేసుకుని నేల మీద నిలబడి, భుజములను చాచి, నేలను తాకుతున్న పొడవైన నల్లని కురులను కుదురుగా బంధించి కట్టి తలను పైకెత్తి ఆకాశం వైపుకు చూస్తూ, శ్వాసను నిర్బంధించి, అత్యంత దుర్భరమైన తపస్సు ను చేయడంలో నిమగ్నమై వున్న అదితిని చూసి భయంతో ఆమెకు చేతులు జోడించి నమస్కరించారు వారు.
చం|| తనువుగశింపఁజేయునది ధర్మము గాదని పెద్దలాఁడగా
వినివినియుండి యేటికి వివేకము లేక తపంబుసేయఁ బూ
నిననినునేమనంగలము నేరము లెంచఁగరాదు గాని యో
జనని యభీష్టమొందుటకు సాధ్వులకుంబతి భక్తిచాలదే.
దైత్యుల మాత అయిన దితి, దేవతల మాత అయిన అదితి అక్కచెల్లెళ్ళు అయిన కారణంగా, అదితి దానవులకు కూడా అమ్మయే. వెంటనే అమ్మచేత ఆ కఠోరమైన తపస్సుమానిపించే ప్రయత్నానికి పూనుకున్నారువారు. ”శరీరాన్ని ఎండబెట్టుకుం టూ ఏదో సాధించాలని చేసే ప్రయత్నాలలో అంతగా ధర్మం ఉండదని ఒక మాటగా పెద్దలు చెబుతూ ఉండడం మనం వింటూనే ఉన్నాం కదా! అయినా ఈ ప్రయత్నాన్ని చేస్తున్న అమ్మవైన నిన్ను మేము ఏమనగలం? ఇలా అంటున్నందుకు మమ్ములను తప్పు పట్టవద్దు. తాను కోరుకుంటున్నదాన్ని సాధించడానికి సాధ్వులైన స్త్రీలకు పతి భక్తి ఒక్కటే సరిపోతుంది కదా!” అనే మాటలతో అదితి మనసును కరిగించే ప్రయ త్నం వారు చేయడం పై పద్యం భావం.
ఉ|| అమ్మరొనిన్నుఁ బాసిక్షణమైనను రిక్తగృ#హంబునందు మే
మెమ్మెయినుండు వారమటనెందఱుగల్గిన నీవు లేని గే
#హమ్మది యేలబోదమిపుడాలయ సీమకు రమ్ము మా విచా
రమ్ముడిగింపుమింపుగను రక్షయొనర్పుము దీర్పుమాపదల్‌.
”అమ్మా! నీవు లేని ఇంటిలో మేము ఎలా వుండగలం?” ఇంటికి నిండుదనాన్ని ఇచ్చేది అమ్మ. అది దేవతలకైనా, దానవులకైనా సమానమే! ఇంట్లో ఎంతమంది ఉ న్నా అమ్మ లేకపోతే ఆ ఇల్లు వెలితిగానే ఉంటుంది. ఆ ఇంట్లో ఉండ బుద్ధి కాదు. అం దువలన ”ఈ అడవిని వదలి ఇంటికి వచ్చి మా విచారాన్ని పోగొట్టి, మమ్మలను రక్షిం చి, ఆపదల నుంచి కాపాడమని” తమ విన్నపాన్ని ఆలకించమని వేడుకున్నారు. కం|| రోగి దరిద్రుడు పరదే
శాగతుఁడుందల్లిఁ జూచియానందించు
న్భోగము భాగ్యము రాజ్య
శ్రీగలవారలకువేఱ చెప్పఁగవలెనే.
పై రెండు పద్యాలలోని సారాంశం మరింత సూటిగా, సంక్షిప్తీకరించి నిక్షిప్తం చేయబడింది ఈ పద్యంలో. ”ఒక జబ్బుపడినవాడు, డబ్బును పోగొట్టుకుని దరిద్రు డైనవాడు, అప్పుడే పరదేశం నుంచి తిరిగి వచ్చినవాడు. వీళ్ళు అమ్మ ముఖంలో ఏమి చూస్తారు? అనే ప్రశ్నకు సమాధానంగా, జబ్బుపడిన వాడు స్వస్థత అనే భోగా న్ని, దరిద్రుడు ధనంతో కూడిన సంపదను, పరదేశం నుంచి వచ్చినవాడు స్వస్థలం లేదా సొంతగడ్డపై కాలుపెట్టడం అనే రాజభోగాన్ని చూస్తారని సూచిస్తూ, ఇంతకంటే ఇంకేమి సౌఖ్యం కావాలో, అసలు కష్టంలో అమ్మ ముఖం చూడడం వలన కలిగే సౌ ఖ్యం ఏమిటో ఇంతకుమించి చెప్పాల్సింది ఏమైనా వున్నదా?” అని దైత్యుల చేత అనిపించాడు ధరణిదేవుల రామయమంత్రి. అమ్మ చెంత సంతానం పొందే స్వస్థతను, సౌఖ్యాన్ని గురించి ఇంతకంటే సంక్షిప్తంగా ఇంకేమి చెప్పగలం!

Advertisement

తాజా వార్తలు

Advertisement