Friday, May 3, 2024

స్వస్తిక అంతరార్థం

స్వస్తిక్‌ చిహ్నానికి చాలా ప్రాధాన్యత ఉంది. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీయడం చూస్తుంటాం. స్వస్తిక్‌ అంటే శుభ ప్రదం. శుభం జరగటం అని అర్థం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటంవల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉం ది. విఘ్నాధిపతి గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుక స్వస్తి క్‌ను శుభప్రదంగా భావిస్తారు. సంస్కృతంలో స్వస్తిక్‌కు మంచి, శుభం అని అర్థాలు వస్తాయి. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందని కూడా అంటారు. అందుచేత పురాతన కాలంలో సూర్యపూజ లకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతీక గానూ చెబుతారు. అస్తి అంటే కలుగుగాక అని అర్థం వస్తుంది. రెండింటినీ క లిపితే సు అస్తి స్వస్తిగా మారుతుంది. అంటే మంచి ఆరోగ్యం లేదా శుభం కలుగుతుంది అని అర్థం. అందుకనే ఈ చిహ్నం తమకు అన్నివిధాలుగా మంచి చేస్తుందని చెప్పి అనేకమంది దీన్ని వాడడం మొదలుపెట్టారు.
స్వస్తిక్‌ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచి స్తాయి. అంటే జీవుల పుట్టుక, మరణం ఒకదాని తరువాత ఒకటి నిరంతరా యంగా జరుగుతుందని అర్థం. స్వస్తిక్‌ చుట్టూ వృత్తాన్ని గీస్తే వచ్చే చిహ్నం సూర్యుడిని ప్రతిబింబిస్తుంది. అది కాంతికి జన్మ స్థానంగా చెప్పబడు తుంది. అది విశ్వంలో నలువైపులకు వ్యాపిస్తుంది.
స్వస్తిక్‌కు ఉండే నాలుగు రేఖలు నాలుగు దిక్కులను కూడా సూచి స్తాయి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను సూచిస్తాయి. స్వస్తిక్‌ మధ్యలో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు. అందువల్ల స్వస్తిక్‌ మధ్య స్థానం నుంచి విశ్వం ఆవిర్భవించి విస్తరించిందని చెబుతారు. స్వస్తిక్‌ మధ్య భాగా న్ని దైవానికి ప్రతీక అని భావిస్తారు. స్వస్తిక్‌ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు. మరొక రేఖ ను నాలుగు వేదాలని చెబుతారు. మరొక రేఖను నాలుగు పురుషార్థాలని భావిస్తారు. ఇంకో రేఖను పౌరులు పాటించాల్సిన ఆశ్రమ ధర్మాలని చెబు తారు. వేదాలు నాలుగు- రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. పురుషార్థాలు కూడా నాలుగు- ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆశ్రమ ధర్మాలు కూడా నాలుగు- బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మా లు బౌద్ధులు స్వస్తిక్‌ చిహ్నాన్ని ప్రతిభా పాటవాలకు, నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు.
సుమారుగా 12వేల ఏళ్ల కిందటి నుంచి స్వస్తిక్‌ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు. కేవలం మన దేశంలోనే కాదు. అనేక దేశాలకు చెందినవారు స్వస్తిక్‌ను, దాన్ని పోలిన చిహ్నాలను అనేక వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు.
ఉక్రెయిన్‌లోని మెజిన్‌ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్క బడిన పక్షి బొమ్మలో స్వస్తిక్‌ చిహ్నాన్ని గుర్తించారు. అది సుమారుగా 13వేల ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధి జం, జైనిజంలలో, టిబెట్‌, చైనా, జపాన్‌, గ్రీస్‌, అజ్టెక్‌, సె¸్లూన్‌, హూపి, సెల్ట్‌, బాలి, మాల్టా, ల్యాప్‌ లాండ్‌ వంటి దేశాల్లో వాడుతున్నారు.
ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో స్వస్తిక్‌ చిహ్నాన్ని ఆధ్యా త్మికతకు చిహ్నంగా ఉపయోగిస్తారు. నొవాజో అనే ఓ తెగకు చెందినవారు స్వస్తిక్‌ చిహ్నాన్ని అనారోగ్యాలను నయం చేసేందుకు నిర్వహించే ముఖ్యమై న కార్యక్రమాల్లో వాడతారు. అయితే జర్మన్‌ నియంత హిట్లర్‌ కూడా స్వస్తిక్‌ చిహ్నాన్ని తన నాజీ సైన్యంలో ఉపయోగించాడు. అందువల్ల స్వస్తిక్‌ను చెడు అనుకునేవారు కూడా చాలామందే ఉన్నారు.
మన దేశంలో ఆర్యులు జర్మనీ దేశానికి చెందిన పూర్వీకులు అని హిట్లర్‌ నమ్మేవాడు. అందుకనే మనదేశంలో ఎక్కువగా ఉపయోగించే స్వస్తిక్‌ చిహ్నాన్ని హిట్లర్‌ తన నాజీ సైన్యం చిహ్నంగా ఉపయోగించాడని చెబుతా రు. ఇక స్వస్తిక్‌ చిహ్నాన్ని అనేక రకాలుగా వాడుతున్నారు. వాటిల్లో రెండు రకాలు ప్రధానంగా ఉన్నాయి. స్వస్తిక్‌, ఓం, త్రిశూలం అనే మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతా యి. అయితే స్వస్తిక్‌ గుర్తులు, పటాలు పాదాలు తాకేలా వుండకూడదు. స్వస్తిక్‌ను డోర్‌కు అతి కించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఈతిబాధ లుండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. అంతేకాదు షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు.
ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్య జీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతా యనీ సూచన. భారతీయులు స్వస్తిక్‌ను ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. దేశంలో అనేక మతాలకు చెందినవారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగి స్తారు. స్వస్తిక్‌ రంగవల్లికలు పూజా గదిలో పెట్టి పూజ చేయడం ద్వారా అను కున్న కార్యాలు పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

  • డా. సిహెచ్‌.హరిబాబు 9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement