Saturday, May 4, 2024

శ్రవణ సాధనే భక్తితత్త్వ మార్గం


ఓ అర్జునా, మనస్సు నాయందే లగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నువ్వు నన్ను చేరే మార్గం ఇప్పుడుతెలుపుతాను, శ్రద్ధగా విను అని పై శ్లోకం యొక్క భావం.
భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం జీవుడు ఆత్మ స్వరూపుడని, వివిధ యోగ సాధనలను అభ్య సించడం ద్వారా తనను తాను ఆత్మసాక్షాత్కార స్థితి కి ఉద్ధరించుకోవడం సాధ్యమే అని చెబుతోంది. అయితే మార్గం మాత్రమే గీత చూపిస్తుంది, ఆ మా ర్గంలో క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో నడవడం అన్నది పూర్తిగా సాధకుని చేతిలోనే వుందన్నది విస్పష్టం. భగవంతుని యందు మనస్సును సంపూర్ణంగా ల గ్నం చేసి, ఎలాంటి సంశయ ఆలోచనలకు తావివ్వ కుండా నిరంతర ఆరాధనయే అన్ని యోగాలలో కె ల్లా ఉత్తమమైనదని గీత ప్రభోదిస్తోంది. అంటే భగ వంతునిపై మనస్సును లగ్నం చేయడం ద్వారా పర తత్వపు విశిష్టత అవగతం చేసుకోవడం సాధ్యం. పరి పూర్ణ భక్తి భావన తప్పితే ఇతరమైన యోగ సాధనల ద్వారా పామరులు భగవంతుని చేరడం చాలా కష్టం.
అయితే ఈ మనస్సును లగ్నం చేయడం అనే ప్రక్రియను మొదట భక్తి యుత సేవతో ప్రారం భించాలి. దానితోపాటు నవ విధ భక్తి మార్గాలలో ఏదో ఒకమార్గం ఎంపిక చేసుకోవచ్చు కాని అన్ని ంటికంటే ముఖ్యమైనది అయిన శ్రవణం అంటే భగవంతుని గూర్చి ప్రవ చనాలు, కీరన్తలను, శ్లో కాలు, నామ పారాయ ణ వంటివి పవిత్రమైన మనస్సుతో వినడం ప్రా రంభించాలి. భాగవతం లో ప్రధమ స్కంధములో రెండవ అధ్యాయంలో తెలిపిన విధంగా భక్తులు చిత్తశుద్ధితో భగవంతుని గూర్చి శ్రవణం చేస్తే వారిని తన సన్నిహత స్నేహ తునిగా గుర్తించి అధ్యాత్మిక మార్గంలో ఉద్ధరిస్తా డు.ఎంత ఎక్కువగా శ్రవణం అనే సాధన చేస్తే అంత త్వరగా భక్తి తత్వంలో పాదుకొనగలుగుతాడు. మా నవులు రజ, తమో గుణాలు, కామము, లోభము, మోహం ఇత్యాది అరిషడ్వర్గాల నుండి విముక్తుడు అవుతారు. చిత్తశుద్ధి ఎక్కువైనప్పుడు మనస్సు అప్రయత్నంగా భగవంతునిపై లగ్నం అయిపో తుంది. ఇతరమైన ఆలోచనలు అసలు దరి చేరవు. కళ్ళు చెమరించడం, గొంతుక ఆర్చు కొనిపోవడం, శరీరం ఆపాదమస్త కం భక్తి భావనతో పులకించిపోవ డం వంటి సాత్విక భావాలు అప్రయత్నంగా కలుగు తాయి. అప్పుడు సాధనా మార్గంలో తొలి విజయం అందుకునట్లే! సాధన మరింత తీవ్రతరం అయిన ప్పుడు మన ప్రమేయం లేకుండానే మనస్సు నిశ్చ లం అయిపోయి సమాధి స్థితి లేక ఆత్మ సాక్షాత్కా రం కలుగుతుంది. మనస్సులో ఆ కల్మషాలు తొలగి పోతే వారు శుద్ధ సత్వ స్థితిని పొంది ఎవరు ఈ జగత్తు లో సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడో అటువం టి పరమాత్మను శీఘ్రమే చేరగలరు.

  • సి.హెచ్‌.ప్రతాప్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement