Saturday, April 27, 2024

దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం.. అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి, బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తారు. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్ధం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement