Sunday, April 28, 2024

కాళీమాత పాదాల కింద శివుడు!

కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉం టాడో పురాణ గాథలో ఆసక్తికర కథ ఉంది. రాక్షస గణా లను అందరినీ చంపగా చివరికి రక్తబీజు అనే రాక్షసుడు మిగులుతాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజు ని ఒంటి నుంచి ఒక్క రక్తం చుక్క భూమిపై పడిన వెంటనే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు.
దీంతో దుర్గ అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ పోయింది. దుర్గాదేవి అయోమ య స్థితిలో పడుతుంది.
సైనికులు మూకుమ్మడిగా దుర్గపై దాడి చేస్తూ ఉంటారు. ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపం లోని కాళి ఆవిర్భవించింది. కాళి సైనికులను సంహరిం చి, చివరకు రక్తబీజు పై దాడి చేస్తుంది.
రక్తబీజుని ఒడిసిపట్టుకొని అతని ఒంటిలోని రక్తా న్ని పూ ర్తిగా తాగేస్తుంది.
అనంతరం రక్తబీజుడి తలని చేతిలో పట్టుకొని రక్తం కింద పడ కుండా కింద ఓ చిప్ప పట్టుకుంటుంది. దీంతో రక్తబీజుడు మరణిస్తాడు.అయితే రక్తబీజు రక్తం తాగిన కాళిపై దుష్ప్రభావం చూప సాగింది. దీంతో కాళి కరాళనృత్యం చేయడం ప్రారంభిస్తుంది. భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళి వినాశనం మొదలవు తుంది. దేవతలు రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుడిని ప్రార్ధిస్తా రు. శివుడు యుద్ధభూమికి వచ్చి కాళిని శాంతింప చేయడానికి ఆమెను పలుమార్లు పిలుస్తాడు. అయితే ఆమె వినిపించుకొనే స్థితిలో ఉండదు.
రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తుంటుం ది. ఆమె కొప్పు ముడి తొలగి కేశరాశిగా మారుతుంది. విప్పుకొన్న ఆమె కేశ పాశం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరంగా విసిరేస్తుంది. శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివర కు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళి పాదాల కింద చేరతాడు. తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని కాళి తెలు సుకొని కొంతసేపటి తర్వాత శాంతిస్తుంది.ఆ కోపాగ్ని నుంచి బయటపడి శాంతం వ#హంచి మామూలు దుర్గగా మారుతుంది.
ఇదీ శివుడు కాళి కింద ఉండడానికి కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement