Friday, May 10, 2024

విశాఖలో జనసేన అధినేత.. రిషికొండ పనులను పరిశీలించిన పవన్ కల్యాణ్

విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు బయలుదేరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా వైసీపీ నేతలు యథచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రిషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటపెట్టుకుని రిషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్…కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా…వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఒ మట్టి గుట్టను ఎక్కి…బారీకేడ్ల ఆవతలి వైపు ఏం జరుగుతుందన్న దానిని పరిశీలించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పరిశీలిస్తున్న వీడియోని రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement