Tuesday, May 21, 2024

తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 8 గంట‌ల స‌మ‌యం..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. భక్తులకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 88,613 మంది భక్తులు దర్శించుకోగా 36,153 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.24 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement