Monday, April 29, 2024

యాదాద్రిలో భ‌క్తుల ర‌ద్దీ.. కార్తీక మాసం ప్ర‌త్యేక పూజ‌లు..

యాదాద్రి: యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీనార‌సింహ స్వామి వారికి దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం, అందులో కార్తీక మాసం కావ‌డంతో భ‌క్తుల‌కు యాదాద్రిని ద‌ర్శించుకునేందుకు క్యూ క‌ట్టారు. ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. స్వామి వారి ద‌ర్శ‌నానికి సుమారు 5 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, రూ.150 ద‌ర్శ‌నానికి 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు. కార్తీక మాసం సంద‌ర్శంగా స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఉద‌యం 5 గంటల నుంచి ప‌లు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. స్వామివారికి అర్చ‌న‌లు, అభిషేకాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement