Wednesday, May 8, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 6 గంట‌ల స‌మ‌యం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 31 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 65,898 మంది భక్తులు దర్శించుకోగా 33,686 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement