Monday, April 29, 2024

తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. శ్రీ వేంక‌టేశ్వ స్వామి ద‌ర్శ‌నానికి 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు స్వామి వారి సర్వదర్శనం 24 గంటల్లో కలుగుతుందని అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 63,549 మంది భక్తులు దర్శించుకోగా 23,919 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement