Tuesday, May 7, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 14 గంట‌ల స‌మ‌యం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి సర్వదర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 74,231 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 33,591 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement