Monday, April 29, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారికి ద‌ర్శానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల స్వామివారిని 62,276 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.71 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement