Sunday, May 5, 2024

బుద్ధుడి మహా పరినిర్వాణం!

బుద్ధుడు తనను తాను దేవుని దూతగా ప్రక టించుకోలేదు. మోక్షదాతగానూ చెప్పుకోలేదు. తాను ఒక మార్గదాతనని మాత్రమే చెప్పాడు. ఆచర ణలో చూపాడు. దు:ఖసాగరంలో మునిగి తేలు తున్న మానవ సమాజానికీ, అసమానతలతో అల మటిస్తున్న ప్రజా సందోహానికీ దు:ఖ నిర్వాణ మా ర్గాన్ని చూపించాడు. అందువల్లనే బుద్ధుడు కాలం తోపాటు కనుమరుగు కాలేదు. ”నేను చెప్పినది ఏదైనా మీ అనుభవానికి అందకపోతే గుడ్డిగా విశ్వ సించకండి” అని చెప్పాడు.
కాబట్టే కాలాన్ని జయించి, ఇన్ని వేల సంవత్సరాలు తన ధర్మంతో ధర ణీతలాన్ని తడిపి, మానవీయ ఫలాల ను పండించగలుగుతున్నాడు. అలాంటి మనహనీయుడు సాధార ణ మానవుల్లా మరణానికి భయపడ తాడా! అలాంటి భయం లేదు కాబట్టే ప్రాణాలకు ప్రమాదం కలిగించే యు ద్ధ క్షేత్రాల మధ్యకు వెళ్ళి నిలబడ్డాడు. యుద్ధాలను ఆపు చేయించాడు. అతి క్రూరులైన వారి దగ్గరకు ఒంటరి గానే వెళ్ళాడు. వారిలో పరివర్తన కలిగించాడు.
బుద్ధుడు ముప్ఫై ఆరవ యేట జ్ఞానోదయం పొందిన తరువాత దాదాపు నలభై అయిదేళ్ళు తన ధర్మాన్ని నిర్విరామంగా ప్రచారం చేశాడు. ప్రజల నుంచి కనీవినీ ఎరుగని ఆదరణ పొందాడు. బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. వ్యక్తులకన్నా సంఘమే చిరస్థాయిగా నిలబడుతుందని నమ్మాడు. వేలాది ఆరామాలు, విహారాలు, సంఘ శాఖలు ఏర్పడిన తరువాత… ఇక నిర్వాణ మార్గానికి మళ్ళాలని అను కున్నాడు. అది బుద్ధుడి ఎనభయ్యో సంవత్సరం. ఆయ న తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. తన చివరి ‘చారిక’లో భాగంగా వైశాలీ నగరానికి వచ్చాడు. ఆమ్రపాలికి చెందిన ఆమ్రవనంలో కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడకు దగ్గరలో ఉన్న బేళువ అనే గ్రామంలో ఆ ఏడాది వర్షావాసాన్ని గడి పాడు. ఆ కాలంలోనే ఆయనకు ఉదర సంబం ధమైన వ్యాధి కలిగింది. వర్షావాసం ముగిశాక తిరి గి వైశాలిలోని చాపల చైత్యానికి చేరాడు. తన ప్రధాన అనుయాయుడైన ఆనందుణ్ణి పిలిచి, ”ఆనందా! తథాగతుడు పరినిర్వాణం చెందే సమయం ఆసన్న మయింది. మూడు నెలల్లో పరినిర్వాణం పొందు తాను. మనకు ప్రియమైనవి దూ రం అవుతాయి. విభాజ్యం చెందు తాయి. విడిపోతాయి. పుట్టిన ప్రతీ దీ గిట్టుతుంది. సంస్కారాలు సర్వంఅనిత్యాలే!” అన్నాడు మం దహాసంతో. ఆనందుడు కలవరప డ్డాడు. అతని కంట నీరుకారింది.
ఆ రోజు మాఘ పున్నమి. బుద్ధుని కోరికపై శ్రావస్తి సమీపంలోని భిక్షువులందరినీ మహాకూటగారశాలలో ఆ పున్న మి రాత్రి సమావేశపరిచారు. బుద్ధుడు వారికి ధర్మోపదేశం చేసి, తన నిర్వాణాన్ని ప్రకటించాడు. ఆ మరునాడు లిచ్ఛవుల రాజధాని వైశాలి నుంచి మల్లుల రాజధాని కుసీనరకు బుద్ధుడు బయలుదేరాడు. ”ఇదే వైశాలిని నేను చూసే చివరి చూపు” అని ఆయన వెనక్కు తిరిగి, చాలాసేపు వైశాలి వైపు చూశాడు. ఆ తరువాత మరి న్ని గ్రామాలు తిరుగుతూ పావా నగరం చేరాడు. చుందుడు అనే అనుయాయుడు పెట్టిన ఆహారం తిన్నాక, బుద్ధుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. అక్కడే కొన్నాళ్ళు ఉండి, తిరిగి బయలుదేరి, వైశాఖ పౌర్ణమి నాటికి కుసీనరకు చేరాడు. ఆ రాత్రే బుద్ధుడి మహాపరి నిర్వాణం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement