Friday, April 26, 2024

బీజేపీలో చేరనున్న బోగ శ్రావణి

జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఈరోజు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, పార్టీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. మరోవైపు శ్రావణి చేరిక పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కానుందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement