Tuesday, May 7, 2024

దక్షిణ కైలాసంలో…బ్రహ్మోత్సవ సంరంభం!

శివ రాత్రి సందర్భంగా దక్షిణ కైలాసం అయిన శ్రీకాళహస్తి లో పరమేశ్వరుని బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో పలు సేవలు ప్రారంభమయ్యా యి. 8వ తేదీ మహాశివరాత్రి రోజున నందిసేవ, లింగోద్భవం ఉత్సవా లు భక్తజన కోటి శివనామస్మరణల మధ్య అత్యంత భక్తితో జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణం స్వర్ణ ముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీ నమైన, పంచభూత లింగ ములలో నాల్గవదైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉం టుంది. పంచభూతాలయిన భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని శక్తులను పరమేశ్వరుడు తనలో నిక్షేపించుకొని, లింగాకారంగా ఆవి ర్భవించాడు. కంచి క్షేత్రంలో పృథ్వీ లిం గంగా, చిదంబర క్షేత్రంలో ఆకాశలిం గంగా, జంబుకేశ్వర క్షేత్రంలో జల లిం గంగా, అరుణాచలంలో అగ్ని లింగం గా, శ్రీకాళహస్తిలో వాయు లింగంగా ఆవిర్భవించాడు. అందుకే శ్రీకాళహస్తీ శ్వరుని పక్క నున్న రెండు దీపాలు శివ లింగ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన వచ్చే గాలికి కదులుతూ వుంటాయి. ఈ శివ లింగం స్వయంభూ లింగం.
శైవ క్షేత్రాలలో కల్లా అత్యుత్తమ మైంది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ఇక్కడి పర్వతశ్రేణులే దక్షిణ కైలాసగిరి పర్వ తాలు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి, శ్రీకాళహస్తీశ్వరుని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించినంత మాత్రాన ముక్తి కలుగుతుందని ప్రశస్తి. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరు డు పశ్చిమ ముఖంగాను దక్షిణా మూర్తి దక్షిణ ముఖం (మహాద్వారం ఎదురు) ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. క్షేత్ర పురాణ కథనాల ప్రకారం దక్షిణ కైలాస మందు వాయు లింగాకృతి గల శివలింగాన్ని కాళం అనే పేరుగల సర్పం ప్రాత:కాల మందే మణులతో పూజిస్తూండేది. మధ్యాహ్న సమయంలో అక్కడికి వచ్చే ఏనుగు శివునికి సర్పంచే సమర్పించబడ్డ మణులను రాళ్ళుగా భావించి, వాటిని తొలగించి తన తొండంతో తెచ్చిన నీటితో లింగానికి అభిషేకం చేసి, కమలాలతో పూజిస్తూండేది. సర్పం సమర్పించిన మణుల ను ఏనుగు, ఏనుగు సమర్పించిన కమలాలను సర్పం తొలగిస్తూండేది. తమ పూజలకు భం గం కలిగిస్తున్న వారిని కనిపెట్టి, శిక్షించాలని ఒకటి కొకటి భావించాయి.
ఒకరోజు సర్పం శివలింగం వెనుక భాగాన వేచి ఉండగా, ఏనుగు ప్రతిరోజూ లాగానే వచ్చి, మణులను తొలగించి, అభిషేకం చేసి పద్మాలతో పూజిస్తూండగా సర్పం, తను సమర్పించిన మణులను తొలగించిన ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. ఆ బాధను భరిం చలేక ఏనుగు ఘీంకారం చేస్తూ శివుని వెనుక భాగాన గల పర్వతాన్ని తొండంతో ఢీకొట్టింది. వెంటనే ఏనుగు, అదే సమయంలో తొండంలో గల సర్పం కూడా మరణించడం జరిగాయి. ఒకేసారి రెండు జీవులూ పరమ శివునిలో ఐక్యమైనాయి.
పరమశివుడు వాటి భక్తికి మెచ్చి వరం కోరుకోమనగా, అవి, ఆ వాయులింగం తమ పేరున ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి. మొదట ‘శ్రీ’ అనే పేరు గల సాలీడు శివ సాయుజ్యం పొందడం, తర్వాత కాళం, హస్తి శివసాయుజ్యం పొందినందున, వాటి కోరికపై పరమేశ్వ రుడు వెలసిన వాయులింగాన్ని ‘శ్రీకాళ హస్తీశ్వరుడు’ అని, ఆ క్షేత్రం దక్షిణ కైలాసానికి బదు లుగా ‘శ్రీకాళహస్తి’ అని పిలువబడుతుందని కైలాస నాథుడు అనుగ్రహంచినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీ.శ. 12వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు శ్రీకాళ#హస్తీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. రాజేంద్ర చోళుని పాలన 13వ శతా బ్దంలో ముగిసిన తర్వాత, విజయనగర రాజులైన సాళువ రాజు, శ్రీకృష్ణదేవ రాయలు, శ్రీకాళ హస్తి జమిందారుల హయాంలో ఈ దేవాలయం అనేకవిధాలుగా అభివృద్ధి చెందినట్లు చెపు తారు. తరువాత చోళులు పద కొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని, మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆల యాలను నిర్మించారు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకా రాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవ రాయల రాతిపై చెక్కించిన రచన ల ఆధారంగా ఆయన 1516వ సంవత్సరంలో గజపతు లపై విజయానికి సూచనగా వంద స్తంభాలు కలిగిన మంటపం,
అన్నింటికన్నా తూర్పు, పడమ ర దిక్కుల వైపు కు ఉన్న ఎత్తైన గాలి గోపురాన్ని నిర్మించినట్లు తెలియజేస్తుంది. క్రీస్తుశకం 1529 అచ్యుత రాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముం దు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజ ధానిలో జరుపుకొన్నాడు.
ఈ ఆలయంలో ప్రధానంగా రా#హు కేతు సర్ప దోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. రుద్రాభి షేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు సేవలు నిర్వహంచనున్నా రు. ఈ ఏడు శివరాత్రి ఉత్సవాలు మార్చి 3న మొదలయ్యాయి. 16వ తేదీవరకు జరుగ నున్నాయి. నేటి రాత్రి (9 న) రథోత్సవం (ఉదయం), బ్ర#హ్మరాత్రి, తెప్పోత్సవం, 10న శివ పార్వతుల కల్యాణం. (స్కంద రాత్రి), 11న సభాపతి కల్యాణం (ఆనంద రాత్రి), 12న గిరి ప్రదక్షిణ. (రుషి రాత్రి), 13 న తీర్థవారి, ధ్వజావరో#హణం, 14: పల్లకీ సేవ (రాత్రి), 15 ఏకాంత సేవ, 16 న నిత్యో త్సవం, అభిషేకం నిర్వహంచనున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ వాయు లింగ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల గ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement