Saturday, May 18, 2024

స్వామివారి ఊర్ధ్వపుండ్రం విశిష్టత

శ్రీ మహావిష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీ వనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. ‘పూడి – ఖండనే’ అనే సంస్కృత ధాతువును అనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగుణాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీఠం ఉంటు-ంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు-. సత్వ గుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ద్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహి స్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు. అనురాగానికి, ప్రేమకు మూలం లక్ష్మీదేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు పుండ్రాల మధ్య మంగళకరమైన శ్రీ చూర్ణం ధరిస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త, సాక్షా త్తూ ఆదిశేషుని అంశతో జన్మించిన శ్రీ రామానుజాచా ర్యుల వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వవుండ్రములు అలంకరించారు. ఇప్పటికీ శ్రీనివా సుని నొసట ప్రతీ శుక్రవారం అభిషేకం తరువాత 16 తులాల పచ్చకర్పూరం, 1 1/2 తులాల కస్తూరితో ఈ తిరునామాలు అలంకరించబడతాయి. శ్రీవారికి అత్యం త ప్రియమైన బ్రహ్మోత్సవ సమయాలలో మాత్రం శ్రీని వాసుని ఊర్ధ్వపుండ్రములలో పచ్చకర్పూరం, కస్తూరి రెట్టింపుగా వినియోగిస్తారు. 10 రోజులపాటు- జరిగే బ్రహ్మోత్సవాలలో, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారంనాడు, మధ్యలో వచ్చే శుక్రవారం రోజు, తిరి గి ముగింపు శుక్రవారం రోజు, ఇలా 3 లేదా 4 శుక్రవారా లలో శ్రీవారి ఊర్ధ్వపుండ్రముల అలంకరణలో 32 తులాల పచ్చ కర్పూరం, 3 తులాల కస్తూరి వినియోగిం చబడుతుంది. ఈ శుక్రవారములను ఆలయ సంప్రదా యాలలో రెట్టింపు శుక్రవారాలని, రెట్టవారాలని వ్యవహ రిస్తారు. ఈ శుక్రవారాలలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించిన వారికి మరో జన్మ ఉండదు. మాన వుడు సహజముగా తమో గుణ ప్రధానుడు. తమో గుణ ము ముఖ వర్ణముతో సూచించబడినది. తమో గుణ మును నశింప చేసుకుని సత్వగుణ ప్రధానులు కావాలి. ఈ సత్వగుణమును సూచించబడేవే తెల్లటి తిరునామా లు. సత్వగుణ సంపన్నుడు మాత్రమేకాక రజోగుణ సంపన్నుడు కూడా కావాలనే భావం అరుణ వర్ణము కలిగిన శ్రీ చూర్ణం వెల్లడిస్తుంది. ధీమహిధియో యోన: ప్రచోదయాత్‌ అనే గాయత్రీ మంత్రానికి అర్థం ఊర్ధ ్వ పుండ్ర ధారణము సూచిస్తుంది. ఇందులో నాలో ఉండి నన్ను సత్కర్మలకు ప్రేరేపించు, వ్యసనాల మాయలో పడనీయకు సన్మార్గములో నడిపించు అని అర్థముంది.

సేకరణ: పుల్లాభొట్ల భాస్కరశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement