Sunday, May 19, 2024

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, ప్రభ న్యూస్‌ : పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది భక్తులతో కొండ కిక్కిరిసింది. ధర్మ దర్శనం క్యూ లైన్‌లోని భక్తులకు మూడు గంటలు, పైసల దర్శనం క్యూ లైన్‌లోని భక్తులు గంటన్నర పాటు శ్రీ స్వామి వారిని దర్శించుకోవడానికి నిరీక్షించాల్సి వచ్చింది. కార్తీక మాసం దృష్ట్యా భ క్తులు అధిక సంఖ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొన్నారు. ఇక బాలాలయ మంటపంలో ఉత్సవమూర్తులను అభిషేకించారు. శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మో త్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారం జరిపారు. వివిధ కైంకర్యాల ద్వారా భక్తుల నుండి రూ. 27లక్షల 78 వేల 451 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement