Tuesday, May 7, 2024

Flash.. Flash: తోటి జవాన్లపై కాల్పులు.. ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం..

తెలంగాణ సరిహద్దు ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా మారాయిగూడెం లింగంపల్లి బేస్ క్యాంప్ లో కాల్పుల కలకలం చెలరేగింది. తోటి జవాన్ల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు మరో జవాన్. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాల్పులలో చనిపోయిన వారిలో రాజమని యాదవ్, ధాంజీ, రాజీవ్ మండల్ గా గుర్తించారు. వీరిలో రాజీవ్ మండల్ వెస్ట్ బెంగాల్ కు చెందినవాడు కాగా, మరో ఇద్దరు బిహార్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement