Saturday, April 27, 2024

పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: హ్రైదరాబాద్‌ లోగల విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయం ఫిలింనగర్‌ దైవ సన్నిధానాన్ని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సందర్శించారు. సోమవారం ఉదయం దైవ సన్నిధానం ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తుల ఆలయాల్లో విశేష పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయాలు, ఆగమ విధానాలపై అర్చకులు, పండితులతో స్వాత్మానందేంద్ర చర్చించారు. ప్రత్యేక హోమాలు, పూజల ద్వారా భక్తులకు చేరువ కావాలని, దసరా నవరాత్రుల్లో, కార్తీక మాసంలో వైభవోపేతంగా పలు ఉత్సవాలు చేపట్టాలని సూచించారు. విశిష్టమైన వైదిక కార్యక్రమాలను ఏటా చేపట్టేలా ప్రణాళిక రచించాలన్నారు. ఆలయాభివృద్ధికి అర్చకులంతా సమిష్టి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ- ఛైర్మన్‌, సినీ నటు-లు మోహన్‌ బాబు స్వామీజీతో భేటీ- అయ్యారు. ఆలయాభివృద్ధికి చేపడుతున్న చర్యలపై స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మోహన్‌బాబుతో చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement