Sunday, May 5, 2024

నేటి నుంచి శ్రీ పరాశరేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి : నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబ‌రు 18, 19వ తేదీల్లో ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. 18న యాగశాలలో పవిత్రమాలలకు పూజలు, ర‌క్షాబంధ‌నం, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. 19న ఉదయం మ‌హా పూర్ణాహుతి, యాగశాలపూజ, పట్టు పవిత్రాలను స్వామి, అమ్మ‌వార్లు, ప‌రివార దేవ‌త‌ల‌కు సమర్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement