Thursday, April 25, 2024

మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి ఆర్య‌వైశ్యుల అభినంద‌న‌లు

స్వచ్చ సర్వేక్షన్ -2021 సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డుకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికైన నేపథ్యంలో ఈ నెల 20న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి అందుకోనున్నారు. ఈసంద‌ర్భంగా బాచుపల్లి మండల, నిజాంపేట్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు మేయ‌ర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఈనెల 21న వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే కార్తీక వనభోజనాలు కార్యక్రమానికి, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాల‌ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాచుపల్లి మండల, నిజాంపేట్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు చెన్నకేశవ రావు, నాగ మల్లేశ్వరరావు, రమేష్, హరి ప్రసాద్, సోమేష్, దామోదర్, ఇతర ముఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement