Saturday, April 27, 2024

టీటీడీ బోర్డు సభ్యులుగా అశోకకుేమార్‌, సంజీవయ్య ప్రమాణ స్వీకారం

తిరుమల, ప్రభన్యూస్‌: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా పోకల అశోక్‌ కుమార్‌, సంజీవయ్యలు గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఏనీ ధర్మారెడ్డి వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, కాఫిటేబుల్‌బుక్‌ను అదనపు ఈవో అందచేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ ఇరువురి బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి, డిప్యూటిఈ వోలు రమేష్‌బాబు, సుధారాణి, లోకనాథం, పే ష్కార్‌ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement