Thursday, April 18, 2024

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లును టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అక్టోబ‌ర్‌ కోటాకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కరోనా నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ కానీ కరోనా నెగిటివ్‌ అనే సర్టిఫికెట్ కానీ తీసుకురావాలని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

అయితే టీటీడీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా టికెట్లు బుక్‌ చేసుకోవడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. కాగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు శనివారం నాడు విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబ‌ర్‌ 31 వరకు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు. అయితే రోజుకు 8 వేల టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement