Friday, April 26, 2024

జూలై 25న అప్ప‌లాయ‌గుంటలోని శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

తిరుపతి : అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 25వ తేదీన పుష్పయాగ మహోత్సవం జ‌రుగ‌నుంది. ఇందుకోసం జూలై 24వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ‌, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు.

జూలై 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం నిర్వ‌హిస్తారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement