Monday, April 29, 2024

త‌మిళ‌నాడులో య‌శోద ఫీవ‌ర్‌.. మ‌రిన్ని స్ర్కీన్‌ల‌లో షోలు ప్రారంభం

స్టార్ హీరోయిన్ సమంత తన లేటెస్ట్ మూవీ యశోదతో మంచి హిట్ కొట్టింది. హరి, హరీష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ. 20 కోట్ల గ్రాస్ కి చేరుకున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఈ మూవీని బాగా రిసీవ్ చేసుకున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తమిళనాడులో సినిమాకు మాంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో తమిళనాడు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లలో షోలు, స్క్రీన్‌ల సంఖ్యను పెంచేసిన‌ట్టు తెలుస్తోంది. శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, రావు రమేష్, కల్పిక, మురళీ శర్మ, సంపత్, దివ్య శ్రీపాద తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement