Wednesday, May 15, 2024

వాస్తవిక సంఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్‌ సన్స్‌…

వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాద్గిరి అండ్‌ సన్స్‌. సినిమా, జీవితం ఒకే నాణనికి రెండు వైపులా ఉంటాయి కాబట్టి వాస్తవికతను సూచించే సినిమాలు బాక్సాఫీస్‌పై, ప్రేక్షకులపై తమదైన ముద్ర వేస్తున్నాయి. చంద్రకళ పందిరి నిర్మించిన ఈ చిత్రానికి బిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి చేస్తున్నారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రంలో ప్రధాన తారాగాణం అనిరుధ్‌ తుకుంట్ల, యశ్విని నివేదిత, జీవా, రాజీవ్‌ కనకాల, మధుమణి, మురళీధర్‌గౌడ్‌, రోహిత్‌ తదితరులు.
ఈ చిత్రానికి సంగీతం విజయ్‌ కూరాకుల, ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేశ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: బిక్షపతి రాజు పందిరి, అమర్‌నాథ్‌ కొత్తూరు. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనీ, ప్రేక్షకు లు సినిమా మొదలు నుంచి చివరి వరకూ నిగమ్నమయ్యేలా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునలా నిర్మించినట్లు నిర్మాతలు వెల్లడించారు. కొత్త, చమత్కారమైన, రిఫ్రె ష్‌గా ఉండే వాటిని చూడాలనే ఆసక్తి ఉన్న ప్రేక్షకులను యాదగిరి అండ్‌ సన్స్‌ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement